సమంత సినిమాలకు ఏడాది గ్యాప్ ఇవ్వడంలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఉందా..!

ఖుషి సినిమా షూటింగ్స్ అనంతరం సమంత ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ట్రీట్మెంట్ కోసం సమంత ఈ గ్యాప్ ఇచ్చిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఇక ఏడాది పాటు సమంతను స్క్రీన్ పై చూడలేమా అంటే ఇక 2024 లోనే సమంత స్క్రీన్ పై కనిపిస్తుందా అంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఇక సమంత ఏడాది వరకు హోటల్స్, గెస్ట్ హౌస్‌లకి పరిమితం అవుతుందని ఎలాగూ బ్రేక్ తీసుకుంటుంది కదా వెళ్తూ వెళ్తూ ఖుషి వేడుకల్లో మరోసారి విజయ్ తో డాన్స్ చేసి ఆ మూవీ హైప్‌ పెంచిందని అందరూ అనుకున్నారు.

అందరూ అనుకున్న విధంగానే సమంత ఈవెంట్ అయిపోయిన వెంటనే అమెరికా వెళ్ళింది. ఇక స్క్రీన్ పై కనిపించక పోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌కి పక్కనే ఉన్న ఫీలింగ్ కలిపిస్తుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఫాన్స్ ను ఖుషి చేస్తుంది. అనారోగ్యం కారణంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళిందని భావించిన సమంత సోషల్ మీడియా ఖాతాలో ఎడాపెడా ఫోటోలు షేర్ చేయడం ఉదయాన్నే లేచి అందంగా ముస్తాబాద్ అమెరికా వీధుల్లో షికార్లు చేస్తుంది.

 

దీంతో ఈమె ట్రీట్మెంట్‌కి వెళ్లిందా.. లేదా వెకేషన్ లోకి వెళ్లిందా అని అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. మునిపెన్నడూ లేని విధంగా స్వేచ్ఛగా విహరిస్తూ రెగ్యులర్గా ఫొటోస్ షేర్ చేస్తుంది సమంత. దీంతో సమంతా హేటర్స్, ట్రోలర్స్ ఆమెరికా వెళ్లింది ట్రీట్‌మెంట్ తీసుకోవడానికా వేకెన్స్‌కా.. ఎంజాయ్ చేయ‌డానికి వెళ్ళేది విశ్రాంతి అంటూ అందరిని టెన్షన్ పెట్టడం ఎందుకు అంటూ నెగిటివ్ కామెంట్స్‌తో రంగంలోకి దిగారు. దీంతో సమంత ఫ్యాన్స్ మాత్రం ఇంతకాలం షూటింగ్లో బిజీగా అలిసిపోయిన సమంత ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటే మీ కళ్ళు కొడుతున్నాయా అంటు కామెంట్స్‌ చేస్తున్నారు.