తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కూడా అఖిల్ సినిమా ఉంటుందని సమాచారం.
ధీర సినిమా పీరియాడికల్ కథతో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అఖిల్ మాత్రం తన ఒపీనియన్గా పూజ హెగ్డే అని రిఫర్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రస్తుతానికైతే బాగానే ఉంది.. కానీ సరైన సక్సెస్ లో లేదు గ్లామర్ ట్రీట్ కూడా ఒక రేంజ్ లో ఆరబోస్తూ ఉంటుంది తన థైస్ అందాలతోనే ఫిదా చేస్తూ ఉంటుంది ప్రేక్షకులను.
ప్రస్తుతం ఈ అమ్మడికి కూడా తెలుగులో ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి కచ్చితంగా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ రకంగానే అఖిల్ ఆమెను లక్కీ హీరోయిన్గా ఎంపిక చేయడం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎవరిని ఫైనల్ గా చేసి చిత్ర బృంద అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి మరి.