అంగరంగ వైభవంగా నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహం.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటులలో ఒకరైన బ్రహ్మానందం దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ నిన్నటి రోజున వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది.

సిద్ధార్థ, ఐశ్వర్యాల వివాహానికి మాజీ ఉపరాష్ట్ర మృతి వెంకయ్య నాయుడు ,తెలంగాణ సీఎం కేసీఆర్.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితర సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలయ్య, మోహన్ బాబు, మురళీమోహన్ ,కోట శ్రీనివాసరావు, రాజశేఖర్ దంపతులు, ఉపాసన ,రాంచరణ్ ,చిరంజీవి భార్య శ్రీకాంత్ ఫ్యామిలీ ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. బ్రహ్మానందం కూడా ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించి కేవలం అడపాదడపా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నారు.. చివరిగా రంగమార్తాండ సినిమాలో ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటించి తనలోని మరొక కోణాన్ని బయటపెట్టారు బ్రహ్మానందం బ్రో సినిమాలో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.బ్రహ్మానందం పెద్ద కుమారుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.