అభిమాని చేసిన ప‌నికి ప‌రుగులు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వైర‌ల్ గా మారిన క్రేజీ వీడియో!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజ‌య్.. గీతా గోవిందంతో మ‌రింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత విజ‌య్ ఖాతాలో స‌రైన హిట్ లేదు. ఈయ‌న గ‌త చిత్రం లైగ‌ర్ దారుణంగా డిజాస్ట‌ర్ అయింది.

అయినాకూడా విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం ద‌గ్గ‌లేదు. అలాగే ఈయ‌న్ను అభిమానించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా ఓ అభిమాని చేసిన ప‌నికి అంద‌రూ చూస్తుండ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రుగులు పెట్టాడు. అస‌లేం జ‌రిగిందంటే.. విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా బేబీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ బేబీ స‌క్సెస్ మీట్ ను నిర్వ‌హించింది. ఈ సినిమాను ఆరంభం నుంచి త‌న‌వంతు ప్ర‌మోట్ చేస్తున్న విజ‌య్‌.. స‌క్సెస్ మీట్ లోనూ సంద‌డి చేశారు. బ్లా కుర్తా వైట్ ప్యాంట్ ధ‌రించి ఆక‌ట్టుకున్నాడు.

అయితే ఈ ఈవెంట్ లో స్టేజ్ పై విజ‌య్ మాట్లాడుతుండ‌గా.. కింద నుంచి ఓ అభిమాని దూసుకొచ్చాడు. సెక్యూరిటీని దాటుచుకుని విజ‌య్ కాళ్ల‌పై పడేందుకు ప‌రుగుప‌రుగునా వ‌చ్చాడు. అయితే స‌ద‌రు వ్య‌క్తి చేసిన ప‌నికి ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌..భద్రతా సిబ్బంది చర్యకు దిగకముందే అతన్ని తప్పించడానికి ప‌క్క‌కు ప‌రుగులు పెట్టాడు. ఆ త‌ర్వాత అదే అభిమానితో ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోనే ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, విజ‌య్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆల్రెడీ ఖుషిని కంప్లీట్ చేసిన ఆయ‌న ప‌రుశురామ్ తో ఓ సినిమా, గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు. ఇవి రెండు ఇటీవ‌లె ప్రారంభం అయ్యాయి.