హీరో నిఖిల్ ని చంపేస్తామంటూ బెదిరించిన స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ..!!

బుల్లితెరపై పలు షో లలో నటిస్తూనే వెండితెరపై అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు . అందులో కలర్స్ స్వాతి కూడ ఒకరు.ఈమె కూడా మొదట్లో యాంకర్ గా పనిచేసి ఆ తరువాత హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది.ఈ అమ్మడు మొట్టమొదటిగా తమిళ్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. స్వాతి తెలుగు తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

స్వాతి మొట్టమొదటిగా డేంజర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాని హీరోగా తెరకెక్కించిన అష్టా చమ్మా సినిమా ద్వారానే ఆమెకి మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తరువాత కార్తికేయ, త్రిపుర, స్వామి రారా, ఇలా కొన్ని సినిమాల్లో నటించి మరింత ఇమేజ్ను దక్కించుకుంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో పంచతంత్రం ఇడియట్స్ వంటి సినిమాలలో నటించింది.

Swathi-Vikas wedding: 7 adorable pictures that will leave you in awe | The  Times of India

అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో నిఖిల్, స్వాతి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో కార్తికేయ, స్వామి రారా చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే అలా సినిమాలు వరుసగా రావడంతో వీరి మధ్య ఏదో ఎఫైర్ ఉందని అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయం స్వాతి కుటుంబ సభ్యులకు తెలియడంతో హీరో నిఖిల్ ని చంపుతామని బెదిరించారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

 

దాంతో స్వాతి శంకరాభరణం సినిమాకి ఓకే చెప్పిందట. కానీ వారి పేరెంట్స్ బెదిరించడంతో అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేసిందట. అంతేకాకుండా స్వాతికి వేరొక వ్యక్తిని ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది అయితే ఈ మధ్యనే తన భర్త నుంచి తాను విడిపోతున్నట్లు పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఈ విషయం పైన స్వాతి ఏ విధంగా స్పందించలేదు మరి రాబోయే రోజుల్లో నైనా ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.