విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. స‌మంత‌ను న‌మ్మి మోస‌పోయాడా..?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. చాలా కాలం నుంచి హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ఈయ‌న‌.. త‌న ఆశ‌ల‌న్నీ `ఖుషి` పైనే పెట్టుకున్నాడు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నార‌ని తెలియ‌గానే.. ఖుషిపైగా భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా మేకర్స్ వ‌రుస అప్డేట్స్ తో మ‌రింత హైప్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 1న తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. తాజాగా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఇంత‌లోనే స‌మంత పెద్ద షాకిచ్చింది. ఖుషి షూటింగ్ ను ముగించిన సమంత.. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా బ్రేక్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.

దాదాపు ఏడాది పాటు ఆమె కెమెరా ముందుకు రాద‌ని అంటున్నారు. అలాగే ఆమె ఖుషి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డం కూడా క‌ష్ట‌మే అని టాక్ న‌డుస్తోంది. ఈ విష‌య‌మే విజ‌య్ ను క‌ల‌వ‌ర పెడుతుంద‌ట‌. అస‌లే ఇది పాన్ ఇండియా సినిమా. పైగా విజ‌య్ గ‌త చిత్రం లైగ‌ర్ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో.. అత‌నొక్క‌డి వ‌ల్ల ఖుషిపై నేష‌న‌ల్ వైడ్ గా హైప్ పెంచ‌డం అసాధ్యం. స‌మంత తోడైతేనే ఖుషికి కావాల్సిన బ‌జ్ ఏర్ప‌డుతుంది. కానీ, స‌మంత ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనేలా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు నెటిజ‌న్లు విజ‌య్ అస‌వ‌రంగా స‌మంత‌ను న‌మ్మి మోస‌పోయాడ‌ని అభిప్రాయ‌పడుతున్నారు.