నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. తక్కువ సమయంలోనే హీరోగా నిలదొక్కుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వరుణ్ తేజ్ `గాండీవదారి అర్జున` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.
వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల కాకముందే ‘పలాస’ దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో తన 14వ సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ మూవీకి `మట్కా` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు. ఇందులో మీనాక్షి చౌదిరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. వరుణ్ తేజ్ హీరోగానే కాకుండా పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. మరోవైపు పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారీగానే సంపాదించాడు.
పలు నివేదికల ప్రకారం.. 2023 నాటికి వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ రూ. 47 కోట్లు అని అంచనా. ఈయన ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. అలాగే వరుణ్ తేజ్ తన సొంత సంపాదనతో గాయత్రి హిల్ లో ఒక గెస్ట్ హౌస్ ను కొనుగోలు చేశారు. వరుణ్ తేజ్ పేరిట హైదరాబాద్ లో పలు ఫ్లాట్స్, స్థలాలు ఉన్నాయి. మరియు ఆయన గ్యారేజ్ లో కోట్లు విలువ చేసే నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి. అన్నట్లు వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ మరికొద్ది రోజుల్లో ఏడడుగులు వేయబోతున్నాడు.