కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో అనుపమ ఒకటి. పైగా ఈ మధ్య గ్లామరస్ ఫోటో షూట్లతో కుర్రకారు మనసులను మరింత దోచేస్తుంది. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ అనుపమ చాలా పద్ధతిగా కనిపించింది. కానీ, కొద్ది రోజుల నుంచి ఈ కేరళ కుట్టి హద్దులు దాటేస్తూ.. తాను కూడా టూ రొమాంటిక్ అని నిరూపించుకుంటోంది.
ఈ క్రమంలోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్కేర్, రవితేజ ఈగల్ చిత్రాల్లో భాగమైన అనుపమ.. తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్ట్ లకు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె బోలెడు కబుర్లు చెప్పుకొచ్చింది. తనకు పెట్స్ అంటే ప్రాణమని.. మన ఫీలింగ్స్ను మరో ఆలోచన లేకుండా అర్థం చేసుకునేవి, స్వార్థం లేకుండా స్పందించేవి అవే అని అనుపమ పేర్కొంది.
అలాగే నాన్వెజ్ ఫుల్గా లాగించేస్తానని, చికెన్ గారెలు కాంబినేషన్ చాలా ఇష్టమని ఆమె తెలిపింది. ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్స్ వేస్తానని.. పెయింటింగ్స్ చేయడం వల్ల తన మనసు ప్రశాంతంగా మారుతుందని అనుపమ వెల్లడించింది. ఇక `రంగస్థలం` మిస్ అయినప్పుడు ఎంతో బాధపడ్డానని.. ఒకవేళ ఆ సినిమాలో నటించి ఉంటే.. అదే నా కెరీర్లో బెస్ట్ మూవీ అయ్యుండేదని ఆమె పేర్కొంది.