విజయ్ దేవ‌ర‌కొండ సినిమాల్లోకి రాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌ని చేసేవాడో తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హ‌ద‌రాబాద్ లో పుట్టిన పెరిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 2011లో నువ్విలా మూవీ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. దాదాపు ఐదేళ్లు ఇండ‌స్ట్రీలో ఉన్నా ఎలాంటి గుర్తింపు ద‌క్క‌లేదు. 2016లో విడుద‌లైన `పెళ్లి చూపులు` మూవీతో విజ‌య్ అంద‌రి క‌ళ్ల‌ల్లో పడ్డాడు. అర్జున్ రెడ్డి తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం మూడు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాడు. అందులో `ఖుషి` ఒక‌టి. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది. అలాగే గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా, ప‌రుశురామ్ తో ఓ సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యాడు.

ఈ రెండు చిత్రాలు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఇటీవ‌లె ప్రారంభం అయ్యాయి. రెండు సినిమాల‌ను విజ‌య్ ఒకేసారి పూర్తి చేయ‌బోతున్నాడు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల్లోకి రాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌ని చేసేవాడో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని కంప్లీట్ చేసిన విజ‌య్‌.. సినిమాల్లోకి రాక‌ముందు ట్యూషన్ మాస్టర్ గా పనిచేసేవార‌ట‌. అయితే త‌న తండ్రి సీరియ‌ల్ డైరెక్ట‌ర్ అవ్వ‌డం వ‌ల్ల విజ‌య్ సినిమాల‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. అన్న‌ట్లు విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ కూడా సినిమాల్లోకి వ‌చ్చాడు. ఇటీవ‌ల బేబీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.