తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలవుతోంది .ఈ వయసులో కూడా అభిమానుల కోసం పలు చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే బాలయ్యకు కలిగి ఉందని చెప్పవచ్చు. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కర్నూలులోని ఆలూరు లో ఉన్న LLNS థియేటర్లో ఏకంగా 200 రోజులు ఈ సినిమాని ప్రదర్శించబడింది.. బాలయ్య నటించిన గత చిత్రాలలో సింహా లెజెండ్ మరికొన్ని చిత్రాలు కూడా ఎక్కువ రోజులు ప్రదర్శించి అరుదైన రికార్డును సహిత సృష్టించాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు సినిమాలను ప్రదర్శించిన ఘనత సొంతం చేసుకోవడం బాలయ్యకే సాధ్యమని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 200 రోజులు సినిమా ఆడడం అంటే అది ఆశ మాస విషయం కాదు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఇందులో కూడా బాలయ్య మరొకసారి మాస్ హీరో గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించక శ్రీ లీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాలో కథ కంటెంట్ బాగా ఉంటే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గించడానికి వెనుకడుగు వేయరు. భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. రాబోయే రోజుల్లో మరి ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుందో మరిన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి అంటూ బాలయ్య అభిమానులు తెలుపుతున్నారు.