బ్రో నుంచి ఫస్ట్ సింగల్ వచ్చేసింది..అదిరిపోయిందిగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగల్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్ రాగా ఇప్పుడు ఈ పాటతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్, స్టైల్ అదిరిపోయిందంటూ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పవర్ స్టార్ , సాయి ధరమ్ తేజ్ కలిసి ఒక స్క్రీన్ పై సందడి చేస్తుండటంతో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. ఈ పాటలో ఊర్వశి రౌతాల స్టెప్పులేసి కవ్వించింది.ఇక ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది. ఈ సినిమా జులై 28న థియేటర్ లలో సందడి చేయనుంది. తమిళ్ లో మంచి విజయం సాధించిన వినోదయ సిత్తం సినిమాను తెలుగులో బ్రో అనే టైటిల్ తో సముద్ర ఖని తీస్తున్నారు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ముందు వచ్చిన స్టిల్స్ మరింత ఆసక్తిని పెంచాయనే చెప్పాలి. తమ్ముడు సినిమా తరువాత బ్రో సినిమాలో అంతే స్టైల్ గా కనిపించాడని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీలో నుంచే ఈ సినిమాలో ఇద్దరు ఉండడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్డేట్ లు వచ్చే ఛాన్స్ ఉంది.