తెలుగు సీరియల్స్ నటీమణులకు దారుణమైన అన్యాయం.. బయటపెట్టిన స్టార్ యాక్ట్రెస్!

తెలుగు సీరియళ్లలో బాగా హిట్టైన వాటిలో నా పేరు మీనాక్షి ఒకటిగా నిలుస్తుంది. ఈటీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఇందులో గౌతమి అనే ఒక నెగిటివ్ పాత్ర చేసిన మధు రెడ్డి బాగా ఆకట్టుకుంది. అందానికి మారుపేరుగా నిలిచే ఈ ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి తర్వాత తెలుగు సీరియళ్లలో కనిపించకుండా పోయింది. అయితే తాజాగా ఆమె తాను కనుమరుగు కావడానికి కారణం ఏంటో చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు రెడ్డి మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకు సినిమాల్లోనే కాదు సీరియళ్లలో కూడా ఎంతో అన్యాయం జరుగుతోందని చెప్పి షాక్ ఇచ్చింది. తెలుగు సీరియళ్లలో కూడా కన్నడ నటీమణులకే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేసింది. తెలుగమ్మాయిలకు సీరియల్ ఇండస్ట్రీలో అసలు రెస్పెక్టే ఉండదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. కన్నడ ముద్దుగుమ్మలే తెలుగు షోలలో రాజ్యమేలుతున్నారని ఆమె పేర్కొంది. అయితే అందులో వారి తప్పేం లేదని, అవకాశాలు ఇచ్చే వారిదే మొత్తం తప్పు అన్నట్లు ఆమె మాట్లాడింది.

తాను తెలుగు సీరియళ్లలో నటించాలని చాలా ప్రయత్నిస్తున్నానని కానీ అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయని తెలిపింది. వచ్చిన అవకాశాలు నచ్చడం లేదని అందుకే వాటిని రిజెక్ట్ చేస్తున్నానని పేర్కొంది. తనకు వచ్చే చిన్న అవకాశాలను ఒప్పుకుంటే బిజీగా ఉండే దానినే కానీ వాటిని చేయడానికి మనసు ఒప్పడం లేదని పేర్కొంది. తెలుగువారిని కనుస్టర్ చేసే కనీసం 50% అవకాశాలైనా ఇవ్వాలని ఆమె సీరియల్స్ దర్శక నిర్మాతలకు విజ్ఞప్తి చేసింది.