హీరోయిన్‌ హన్సికపై తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

హన్సిక మోత్వాని అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆ సినిమాతో ఆమె హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అభిమానులను తన అందచందాలతో కవ్వించింది. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ, తమిళంలో ఈ అమ్మడు సెటిల్ అయింది. అక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇదే కోవలో ఇటీవల ఆమె ఆది పినిశెట్టితో పార్టనర్ సినిమాలో జోడీ కట్టింది. ఇదే సినిమాలో యోగిబాబు, రోబో శంకర్ కూడా నటించింది. ఈ సినిమా టీమ్ అంతా ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో రోబో శంకర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో హాట్ హాట్ గా మారాయి. అనంతరం రోబో శంకర్ ఆ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

పార్టనర్ సినిమా ప్రమోషన్ ఫంక్షన్‌లో రోబో శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడాలో తెలియక హన్సికపై దురుసుగా మాట్లాడి పెను వివాదం సృష్టించాడు. హన్సిక మైనపు బొమ్మలా కనిపిస్తోందని, మైదా పిండిలా కనిపిస్తోందని రోబో శంకర్ వ్యాఖ్యానించాడు. పార్టనర్ సినిమాలో ఓ సన్నివేశంలో హన్సిక కాలును రోబో శంకర్ తాకాల్సి ఉంది. డైరెక్టర్ ఎంత చెప్పినా, ఎంత బ్రతిమిలాడినా ఆమె అందుకు ఒప్పుకోలేదట. కనీసం బొటను వేలును తాకాలని ప్రాధేయపడినా ఆమె అంగీకరించ లేదట.


హన్సిక అంత ఖరాఖండీగా చెప్పేసరికి డైరెక్టర్ షాక్ అయ్యాడట. హీరో టచ్ చేస్తే ఒప్పుకుంది కానీ కమెడియన్ టచ్ చేస్తే ఏ మాత్రం అంగీకరించలేదు అని తనకు అర్ధమైనట్లు రోబో శంకర్ వ్యాఖ్యానించాడు. మాట్లాడిన వెంటనే రోబో శంకర్ వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఓ జర్నలిస్టు మాట్లాడుతూ.. స్టేజీ మర్యాద తెలియని వాళ్లను ఇలా మాట్లాడనీయొద్దని, ఓ హీరోయిన్ గురించి ఇలా మాట్లాడడం చాలా దారుణమని అన్నారు. రోబో శంకర్ ప్రసంగం ఎఫెక్ట్‌ని గ్రహించిన చిత్రబృందం వెంటనే వేదికపైనే అతడి ప్రసంగానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.