సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ అమ్మడు ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసింది. మయోసైటిస్ నుంచి కాస్త కోలుకున్న వెంటనే ఈ రెండు ప్రాజెక్ట్ లను ఒకేసారి పూర్తి చేసే పనిలో పడింది. రెస్ట్ లేకుండా షూటింగ్స్ పాల్గోవడం వల్ల మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఈ రెండిటిని చకచకా ఫినిష్ చేసి.. లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.
త్వరలోనే బెస్ట్ ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికా వెళ్లబోతోంది. అయితే అమెరికాకు వెళ్లేముందు ఓ వెకేషన్ ను ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగానే తన ఫ్రెండ్ అనూషా స్వామితో ఇండోనేషియాలోని బాలి అందాలను ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అక్కడి అందాలను, అందమైన ప్రదేశాలను సమంత తరచూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది.
వెకేషన్ లో ఉన్న సమంత ఓ సాహసానికి పాల్పడింది. నాలుగు డిగ్రీల చల్లని వాటర్ టబ్ లో అర్ధనగ్నంగా ఆరు నిమిషాల పాటు కూర్చుని ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టా ద్వారా పంచుకున్న సామ్.. `ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఐస్ వాటర్ లో అంత సేపు కూర్చోవడటం అంటే మామూలు విషయం కాదు. శరీరం చాలా బాధకు గురవుతుంది. అయినా కూడా బాధను భరించి సమంత సాహసం చేసింది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయట.