లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `సామజవరగమన` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్‌.. ఈ నెల‌లోనే స్ట్రీమింగ్‌!?

టాలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల్లో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` ఒక‌టి. శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్ గా న‌టిస్తే.. నరేష్ , శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దేవి ప్రసాద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జూన్ 29న ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించి డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. రూ. 3.5 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. రూ. 10 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

అంతేకాదు, రిలీజై రెండు వారాలు దాటినా ఇప్ప‌టికి ఈ మూవీ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంటోంది. ఇక‌పోతే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఈ నెల‌లోనే స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని జూలై 22 లేదా జూలై 25న స్ట్రీమింగ్ చేయాల‌ని నెట్‌ఫ్లిక్స్ స‌న్నాహాలు చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు సమాచారం.