తెలుగు సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్స్ సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాలు చేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలతో ఉంటుందని చెప్పవచ్చు.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి హీరో కైనా నో చెప్పేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కో చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూనే ఉంటోంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో కాస్త వెనక పడిందని విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
అయినప్పటికీ కూడా తన క్రేజ్ తోనే ఈ ముద్దుబిమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది ఈ రకంగా ఇప్పటివరకు సాయి పల్లవి క్లీన్ అండ్ గ్రీన్ గాని ఉన్నది.. చివరిగా ఈమె విరాటపర్వం సినిమాలో నటించిన అప్పటినుంచి తన తదుపరి చిత్రంలో మాత్రం కనిపించలేదు.అయితే దాదాపుగా ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. కానీ ఇంతలా గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏంటని విషయం మాత్రం ఇంకా తెలుపలేదు..
ఇదంతా ఇలా ఉంటే ఈ అమ్మడు రెండు ప్రధాన కారణాల వల్ల ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే ఫిదా సినిమా తర్వాత వరుసగా ఆరేడు సినిమాలలో నటించింది. అన్నిటిలో కూడా ప్రధాన పాత్రలోనే నటించింది. హీరోయిన్ అంటే కేవలం నాలుగు పాటలు సీన్లకు మాత్రమే పరిమితం కాకుండా హీరోలకు దీటుగా ఉండే పాత్రలలో నటించి మెప్పించాలని చూసింది. దీంతో కొన్ని సినిమాలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. కానీ సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ ప్రతిసారి ఈమె పాత్రను హైలైట్ చేసేలా టాలీవుడ్ మేకర్స్ కథలు రాయడం అంటే కష్టమే అని చెప్పవచ్చు కేవలం హీరో ఇమేజ్ ని బేస్ చేసుకుని కథలు రాస్తారు తప్ప హీరోయిన్ల ఆధారంగా రాయరు.. అందుకే సాయి పల్లవికి తన పాత్ర నచ్చేవరకు సినిమా సెలెక్ట్ చేయకూడదని ఇంత గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం.