గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ సంఘవి ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ సంఘవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించిన ఈమె స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. సంఘవి వెండితెరపై కనిపించక దాదాపుగా 15 సంవత్సరాలు పైనే అవుతోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించదు సంఘవి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఎప్పుడైనా ఏదైనా వేకేషన్స్ దేవాలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి.

Actress Sanghavi Family Photos with Daughter, Husband💖~90's Ajith & Vijay Heroin  Sanghavi Biography - YouTube

1993 లో అమరావతి అనే కోలీవుడ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంఘవి. ఆ తర్వాత కన్నడ తమిళ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. 1995లో శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో సింధూరం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది సంఘవి. అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన సంఘవి స్టార్ హీరోలతో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. చివరిగా 2005లో ఒక్కడే కానీ ఇద్దరు అనే సినిమాలో నటించింది. 2016 ఫిబ్రవరి 3న ఐటి ప్రొఫెసర్ ఎన్ వెంకటేశం వివాహం చేసుకుంది సంఘవి వీరికి ఒక పాప కూడా జన్మించింది.

Actress Sangavi husband, daughter and family photos with biography ❤🤩  #sangavi #sangavibio - YouTube

తాజాగా సంఘవి నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. తన భర్త వెంకటేష్ కూతురుతో కలిసి తిరుపతిలో ముక్కులు చెల్లించుకున్న సందర్భంగా ఈమె ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో వీరిని సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను కూడా అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలలో సంఘవి చాలా బొద్దుగా తయారైనట్టుగా కనిపిస్తోంది. సంఘవి కూతురు మాత్రం చూడడానికి చాలా క్యూట్ గా కనిపిస్తోంది.