అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. అందులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న `పుష్ప 2` ఒకటి. అలాగే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో `యానిమల్` అనే సినిమా చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకుడు.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులోనూ రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ అయింది. వీటితో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా రష్మిక కమిట్ అయింది. అయితే చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న రష్మిక.. గతంలో చాలా చిత్రాలను రిజెక్ట్ చేసింది. అందులో చిరంజీవి డిజాస్టర్ మూవీ ఆచార్య, విజయ్ దళపతి బ్లాక్ బస్టర్ మూవీ `మాస్టర్` కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ భేటీలో రష్మిక తాను గతంలో రిజెక్ట్ చేసిన ఆచార్య, మాస్టర్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆచార్య, మాస్టర్ సినిమాలను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడతానని రష్మిక పేర్కొంది. చిరంజీవి, విజయ్ వంటి పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం గొప్ప అదృష్టం.. కానీ, పలు కారణాల వల్ల వారి సినిమాలను నేను రిజెక్ట్ చేశాను.. అందుకు ఇప్పటికీ ఫీల్ అవుతాను అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మాస్టర్ అంటే మంచి మూవీ.. దాన్ని వదులుకున్నందుకు బాధపడ్డా తప్పలేదు. కానీ, ఆచర్య వంటి అట్టర్ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నందుకు బాధపడటం ఏంటి.. రష్మికకు మైండ్ గానీ దొబ్బిందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆచార్య కనుక ఆమె చేసుంటే.. రష్మిక కెరీర్ కు పెద్ద మైనస్ అయ్యేదని చర్చించుకుంటున్నారు.