రామ్ కోసం బాలీవుడ్ బ్యూటీల‌ను దింపుతున్న పూరీ.. ఆ ఇద్ద‌రికీ హ్యాండిచ్చిన‌ట్లేనా..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వ‌చ్చిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబో రిపీట్ కాబోతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ గా `డ‌బుల్ ఇస్మార్ట్‌`ను ప్లాన్ చేశారు. ఇటీవ‌లె ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభం అయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. 2024 మార్చి 8న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డ‌బుల్ ఇస్మార్ట్ విడుద‌ల కానుంద‌ని చిత్ర టీమ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తో ప‌రువు మొత్తం పోగొట్టుకున్న పూరీ.. ఇప్పుడు ఈ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని చాలా క‌సిగా ఉన్నాడు.

అన్న‌ట్లు ఈ సినిమాలో హీరోయిన్లు ఎవ‌రు అన్న‌ది ఇంత వ‌ర‌కు మేక‌ర్స్ వెల్ల‌డించ‌లేదు. ఇస్మార్ట్ శంక‌ర్ లో నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ న‌టించారు. కానీ, ఇప్పుడు వారికి అంత క్రేజ్ లేదు. ఈ నేప‌థ్యంలోనే నిధి, న‌భాల‌కు హ్యాంటిచ్చి.. రామ్ కోసం పూరీ బాలీవుడ్ బ్యూటీల‌ను దింపుతున్నాడ‌ట‌. డ‌బుల్ ఇస్మార్ట్ లోనూ ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటార‌ని అంటున్నారు. అందుకే సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ లతో సంప్రదింపులు జ‌రుపుతున్నార‌ని.. వారిద్ద‌రూ రామ్ తో జ‌త క‌ట్టేందుకు రెడీ ఉన్నార‌ని టాక్ న‌డుస్తోంది.