పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు అదే మైనసా..?

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం బ్రో.. మామ అల్లుడు కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆయన చిత్రం వస్తుందంటే చాలు ఎగబడి చూడటానికి థియేటర్ల ముందు క్యూ కడతారు. పవన్ కళ్యాణ్ తీసేది తక్కువ సినిమాలే అయినా అభిమానులు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు.. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్

ఇక సాయిధరమ్ తేజ్ విషయానికి వస్తే.. మొన్నటికి మొన్న విరూపాక్ష సినిమాతో అందరిని అలరించాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాడు. అయితే ఇప్పటికే వచ్చిన బ్రో టీజర్ ప్రేక్షకులకు బానే కనెక్ట్ అయ్యింది. ఇక టీజర్ ని చూస్తుంటే గోపాల గోపాల సినిమా తరహాలో ఉంటుందని అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా మై డియర్ మార్కండేయ అనే సాంగ్ వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా తేజ్ కనిపిస్తున్నాడు. ఇక ఈ సాంగ్ లో ఊర్వశీ రౌటేలా ఈ సాంగ్లో కనిపించడం విశేషం.

ఇక ఈ సినిమాకు ఏకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రం పై ఏకంగా రూ.100 కోట్ల బిజినెస్ చేసింది. అయితే బ్రో సినిమా నుంచి రిలీజ్ అయిన ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా లేదనే మాట వినిపిస్తుంది. ఇక ఈ బ్రో సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్ కి టెన్షన్ స్టార్ట్ అయ్యిందని అర్థమవుతోంది. అయితే ఈ సినిమా తమిళ్ రీమిక్స్ కాబట్టి అక్కడ పాజిటివ్ టాక్ వచ్చింది ఇక్కడ కూడా కచ్చితంగా పాజిటివ్ టాక్ వినిపిస్తుందని అంతేకాకుండా కథ కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అభిమానులు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు అంటూ టాక్ వస్తుంది. కానీ ఇప్పుడు తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్ సినిమాకి మైనస్ గా మారబోతోంది అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.