విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి పబ్లిక్ అప్పీరియన్స్!

కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధర్మపరిరక్షణ యాగం చేసిన సంగతి తెలిసిందే. పవన్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానం కోరుతూ ఈ యాగం నిర్వహించాడు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా కనిపించలేదు. అప్పట్నుంచి వీరిద్దరూ విడిపోయారని రూమర్స్ మొదలయ్యాయి. ఈరోజు నాగబాబు కూతురు విడాకులు తీసుకోగా, మరోవైపు పవన్ కళ్యాణ్ డివోర్స్ రూమర్స్ బీభత్సంగా పెరిగాయి.

ఈ క్రమంలో రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారికి చెంప దెబ్బగా పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి మీడియా కంటపడ్డాడు. జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈరోజు పవన్, అన్నా లెజ్నెవా కలిసి తిరుగుతున్న ఒక ఫొటో షేర్ చేసింది. అలాగే “జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు.” అని పేర్కొంది.

మరికొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్రకి సంబంధించి తదుపరి దశ ఆరంభం అవుతుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ యాత్ర కొరకు సన్నాహాలు చేయడానికి కొన్ని మీటింగ్స్‌లో పాల్గొనేందుకు పవన్ మంగళగిరి కి చేరుకుంటారని కూడా పార్టీ తెలిపింది. అయితే పవన్ విడాకుల గురించి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. తమ అన్న వదినల వైవాహిక జీవితం ఇప్పట్లాగానే కలకలాలపాటు కొనసాగాలని కోరుకుంటున్నారు.