పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా..?

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మ‌హేష్ బాబు స‌తీమ‌ణి నమ్రత శిరోద్కర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో అగ్ర తార‌గా వెలుగొందిన న‌మ్ర‌త‌.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టాక కెరీర్ అట‌కెక్కింది. తెలుగులో త‌న తొలి సినిమా హీరో అయిన మ‌హేష్ బాబుతో ప్రేమ‌లో ప‌డి అత‌నితోనే ఏడడుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు పూర్తిగా పులిస్టాప్ పెట్టింది.

తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో మాత్ర‌మే మెరిసింది. అందులో వంశీ ఒక‌టి కాగా.. మ‌రొక‌టి అంజి. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, న‌మ్ర‌త కాంబోలో ఓ హిట్ మూవీ మిస్ అయింది. ఎ. కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శ్రియా, నేహా ఒబెరాయ్ హీరోయిన్లుగా న‌టించారు. అశ్వనిదత్ నిర్మించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించాడు. 2005లో విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఓ మోస్త‌రు హిట్ అయింది.

అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చే హీరోయిన్ పాత్ర కోసం మొద‌ట న‌మ్ర‌త‌ను సంప్ర‌దించార‌ట‌. క‌థ ఆమెకు చాలా బాగా న‌చ్చింద‌ట‌. కానీ, అప్ప‌టికే మ‌హేష్, న‌మ్ర‌త పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు. పెళ్లి త‌ర్వాత న‌టించ‌న‌ని మ‌హేష్ బాబుకు న‌మ్ర‌త మాట కూడా ఇచ్చింది. అందుకే ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల‌ను పూర్తి చేసే ప‌నిలో న‌మ్ర‌త ఉంద‌ట‌. అలాంటి స‌మ‌యంలో బాలు మూవీని టేక‌ప్ చేయ‌డం ఇష్టం లేక నో చెప్పింద‌ట‌. దాంతో ఆ పాత్ర కోసం నేహా ఒబెరాయ్ ను తీసుకున్నారు. నేహా త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేసింది. అలాగే సినిమా చూసిన వారంతా ఆమె మాట్లాడుకున్నారు.