యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. దేశముదురు మూవీతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హోదాను అందుకుంది. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తోంది.
గత ఏడాది చివర్లో హన్సిక పెళ్లి పీటలు కూడా ఎక్కింది. ప్రియుడు సోహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. 2022 డిసెంబర్ లో జైపూర్లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్లో హన్సిక, సోహైల్ పెళ్లి వైభవంగా జరిగింది. వివాహం అనంతరం కూడా హన్సిక తన కెరీర్ ను కొనసాగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. త్వరలోనే హన్సిన `పార్ట్నర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇందులో స్టార్ కమెడియన్ యోగిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలను పోషించారు.
జూలై 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హన్సిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తన మనసు అర్థం చేసుకున్న స్నేహితుడు భర్తగా రావడం ఎంతో ఆనందంగా ఉందని.. అతను ఎప్పుడూ తనకు సపోర్టివ్గా ఉంటాడని హన్సిక చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటి వరకు తాను 31 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నానని, వారి చదువు కు సంబంధించిన అన్ని విషయాలను తానే చూసుకుంటున్నాను హన్సిక వెల్లడించింది. దీంతో యాపిల్ బ్యూటీ నిజంగా గ్రేట్ అని.. ఏ హీరోయిన్ చేయని పని హన్సిక చేసి గొప్ప మనసు చాటుకుందని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.