డైరెక్టర్ విగ్నేష్ శివన్ ,నయనతార దంపతుల పైన ఇప్పటికే పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసి గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట సౌత్ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్న వీరు వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ జంట సర్వగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినప్పటి నుంచి కూడా ఈ జంట పైన వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు తాజాగా వీరికి మరొక సమస్య ఎదురయింది.శివ తిరుచి జిల్లా లాల్ కుడి గ్రామంలో ఈయన తండ్రి పేరు శివకోలుదు.. వీళ్ళకి 9 మంది అన్నదమ్ములట. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేసిన విజ్ఞేశ్ శివన్ తండ్రి ప్రస్తుతం లేరట ..
అయితే ఆయన జీవించి ఉండగా తన తమ్ముడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండానే మోసగించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూరులో నివసిస్తున్న మరొక సోదరుడు కుంచిత పాదం నిన్నటి రోజున డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో మాణిక్యం పేర్కొంటూ తన సోదరుడు విజ్ఞేశ్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండానే మోసగించారని తెలియజేశారు.. తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చి ఆస్తి తమకు అప్పగించేలా చర్యలు చేపట్టాలంటు కూడా తమ సోదరుడు కుమారుడు విగ్నేష్ అతని తల్లి మీనా కుమారి సోదరి ఐశ్వర్య భార్య నయనతారల పైన కూడా చర్యలు తీసుకోవాలంటే ఆ ఫిర్యాదులో తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు తిరుచి డిఎస్పి దర్యాప్తులో జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.