టాలీవుడ్ హీరోయిన్ మధుబాల గతంలో హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.ఈమె తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ భాషలలో కూడా నటిస్తూ ఉండేది. అయితే ఇండస్ట్రీలో దాదాపుగా పది సంవత్సరాలపాటు హీరోయిన్గా కొనసాగిన మధుబాల ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమైంది.అయితే ఇలా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఈ క్రమంలోని తను నటించిన స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మధుబాల మాట్లాడుతూ సినిమాలకు ఎందుకు దూరం అయ్యారనే విషయాన్ని సైతం తెలియజేసింది. 1991లో అజయ్ దేవగన్ నటించిన బాలీవుడ్ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిందట. అయితే అజయ్ దేవగన్తో కలిసి తన కెరియర్ మొదలు పెట్టినప్పటికీ తిరిగి బాలీవుడ్లో ఈమె మళ్లీ అజయ్ దేవగన్ కు తల్లి పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారట. సమాన వయసు ఉన్నప్పటికీ తనకు ఏకంగా తల్లి పాత్రలో నటించే అవకాశం రావడంతో తనకు ఆ పాత్ర నచ్చాక సినిమాలలో నటించానని చెప్పేసిందట.
ఇక అప్పటి నుంచి తనకు ఇండస్ట్రీలో నటించాలని లేదని అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నానని తెలిపింది. కానీ కొంతమంది మాత్రం తను ఇండస్ట్రీ నుంచి దూరం కావడానికి పెళ్లి కారణమని తెలియజేశారని..అయితే కొంతమంది అభిమానులు మాత్రం లెటర్స్ రాసి తనని సినిమాలలో నటించమని చెప్పే వాళ్ళని తెలియజేసింది. అప్పట్లో హీరోయిన్స్ కి పెద్దగా అవకాశాలు వచ్చేవి కావని అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయని సీనియర్ హీరోయిన్స్ కూడా పలు సినిమాలలో నటించే అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉందంటూ మధుబాల కామెంట్లు చేస్తోంది.