మాజీ మంత్రి నారాయణ ఎప్పుడు ఏదొక వివాదంలో కనిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ గా రాజకీయం నడుస్తూనే ఉంది. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగిన..ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఆయనపై సిఐడి కేసులు ఉన్నాయి. ఇటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి టెన్త్ పేపర్ లీకేజ్ కేసు ఉంది.
ఇలా రకరకాల కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. నారా లోకేశ్ పాదయాత్ర నెల్లూరుకు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన యాక్టివ్ అయ్యారు. అలాగే చంద్రబాబు ఆయన్ని నెల్లూరు సిటీ ఇంచార్జ్ గా నియమించారు. అక్కడ నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతోనే ఓడిన ఆయన..ఈ సారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయనకు ఇంటి పోరు మొదలైంది. ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేసింది.
తాజాగా నారాయణ సోదరుడి భార్య మణిప్రియ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్లు తన పరిస్థితి ఉందని, భార్య ఉండగానే అన్నం తీసుకు రాలేదని తనని కొట్టాడని, అర్ధరాత్రి టార్చర్ పెడుతున్నాడని, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశారు. అలాగే తన కుటుంబాన్ని కూడా నారాయణ ఇబ్బంది పెట్టారని.. గత ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేయాలని ఒత్తిడి తెచ్చారని.. పెళ్లైన రోజు నుండి టార్చర్ మొదలైందని.. రోజు పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు తిడుతూనే ఉంటారంటూ అవేదన వ్యక్తం చేశారు.
ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై నారాయణ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇంతకాలం లేనిది ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారో..అర్ధమవుతుందని ఇదంతా వైసీపీ చేయిస్తున్నా పని అని టిడిపి శ్రేణులు అంటున్నాయి.మరి ఇందులో నిజనిజాలు ఏంటో క్లారిటీ లేదు.