సినిమాలకు బ్రేక్ చెప్పిన మెగా మేనల్లుడు.. షాక్ లో ఫ్యాన్స్..!!

తేజ్ ,పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ఈ సినిమా తమిళ వర్షన్ నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయి ధరంతేజ్ పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల తాను ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు..ఇంతకు ఆ గ్యాప్ ఎందుకు తీసుకోబోతున్నారో తెలుసుకుందాం.

సాయి ధరంతేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.. ఈ ప్రమాదంతో కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మూడు నెలల గ్యాప్ లోనే బ్రో సినిమాని తీసుకురావడంతో అభిమానులు అయితే ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ సినిమా తర్వాత ఆరు నెలలు బ్రేక్ తీసుకోబోతున్నట్లు తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చారు.

Sai Dharam Tej:फिल्मों से ब्रेक लेंंगे साई धरम तेज, यह बड़ी वजह आई सामने - Bro Actor Sai Dharam Tej Announced To Take A Break For 6 Months Read Details Here -

అయితే అందుకు కారణం సాయి ధరంతే బైక్ యాక్సిడెంట్ తర్వాత ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దాని నుంచి కోలుకోవడానికి కాస్త సమయం తీసుకోవాలని తెలియజేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరొక చిన్న పాటి సర్జరీ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆరు నెలల పాటు గ్యాప్ తీసుకొని కంప్లీట్ రెస్టులో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ప్రస్తుతం ఎలాంటి సినిమా కథలు వినలేదని. తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక షార్ట్ ఫిలిం మాత్రమే తీస్తున్నానని తెలియజేశారు. ప్రస్తుతం సాయి ధరంతేజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.