మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. పూజా పరిస్థితి ఏంటి ఇలా అయింది..

డీజే, మహర్షి, రంగస్థలం, అల వైకుంఠపురములో సినిమాలతో టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎదిగింది. అయితే ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్‌గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడుకు ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె చేసిన హిందీ సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ కూడా తుస్సుమనిపించింది. ఇది చాలదన్నట్టు ఆమె చేతికి వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతున్నాయి. గుంటూరు కారం నుంచి పూజాను మేకర్స్ బయటికి పంపించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు జీ కర్దా వెబ్‌సిరీస్‌లో నటించే సువర్ణావకాశం కూడా పోయింది. ఈ వెబ్ సిరీస్ టీమ్ మొదట పూజా హెగ్డేను తీసుకోవాలని ప్రయత్నించింది. అయితే రొమాన్స్ సీన్స్ మరీ హై-లెవెల్‌లో ఉన్నాయని వాటిని కాస్త తేలిగ్గా మార్చాలని పూజా అయితే చెప్పా పెట్టకుండా మేకర్స్ ఆమెకు ఫోన్ చేయడం మానేసి తమన్నాను సంప్రదించారట. దాంతో పూజా పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారయ్యింది.

ఇక పూజా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించాల్సి ఉంది అయితే నాలుగు కోట్లు ఇస్తే గాని ఈ సినిమాలో చేయనని ఆమె అన్నదట. దాంతో ఆమెను తీసేసి వేరే హీరోయిన్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తంగా పూజ చేతికి వచ్చిన ఒక అవకాశాన్ని తమన్నా ఎత్తుకుపోతే, మరొక అవకాశాన్ని మలయాళ బ్యూటీ తన్నుకు పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా పూజా చేతిలో ప్రస్తుతం ఒక సినిమా కూడా లేకపోవడం చాలా బాధాకరం.