ఆ స్టార్ హీరో పై బ్యాన్.. షాక్ లో ఫ్యాన్స్..!!

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వారసత్వం ఉన్నప్పటికీ కేవలం తన సొంత టాలెంట్ తోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. తమిళనాడు మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ నటుడు తాజాగా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ధనుష్ రీసెంట్గా సార్ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం పవన్ ఇండియా లెవెల్ లో తన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.

When Dhanush spoke about his love for cooking: 'I'd been a chef, if not  actor' - Hindustan Times

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ధనుష్ కోలీవుడ్ పెద్దలు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం. తమిళ నిర్మాత మండలి ధనుష్ కు రెడ్ కార్డు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ధనుష్ తో సినిమాలు చేయడానికి వీలు ఉండదని సాధ్యం కాదని ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అయితే ఇందుకు గల కారణం ధనుష్ ప్రముఖ నిర్మాణ సమస్త శ్రీ తెంద్రల్ ఫిలిమ్ నిర్మాణంలో ఒక సినిమాలో నటిస్తానని మాట ఇచ్చారట అందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం.

అడ్వాన్స్ తీసుకొని చాలా కాలమవుతున్న సినిమా మాత్రం చేయడం లేదట ఇక అప్పటినుంచి అడుగుతున్న ఇప్పటివరకు సినిమా చేయకపోవడంతో సదరు నిర్మాత తమిళ నిర్మాత మండల కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుతో ధనుష్ పైన చర్యలు తీసుకోవడం కోసం తమిళ నిర్మాత మండలి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిర్మాతను మోసం చేసినందుకు గాను రెడ్ కార్డు జారీ చేసే ఆలోచనలు నిర్మాత మండలి ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ధనుష్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.