చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కళ్యాణ్ దేవ్ దంపతులు విడిపోయారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీజ, కళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. అంతకు ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో.. శిరీష్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అతనితో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసింది.
కొన్నాళ్లకు చిరంజీవి శ్రీజను కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో పెళ్లి చేయగా.. వీరికి ఒక పాప జన్మించింది. అయితే కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజ ఎక్కువ కాలం తన బంధాన్ని కొనసాగించలేకపోయింది. వ్యక్తిగత విభేదాలతో ఇద్దరూ విడిపోయారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, కలిసి దిగిన ఫోటోలను తొలగించడం, మెగా ఫ్యామిలీ ఈవెంట్స్లో కల్యాణ్ దేవ్ కనిపించకపోవడం వంటి అంశాలు అందరి అనుమాలను బలపరిచాయి.
మొన్నటికి మొన్న కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్ దేవ్.. `వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు గంటలు ఇవే` అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో కళ్యాణ్ దేవ్, శ్రీజ విడాకులు దాదాపు కన్ఫార్మ్ అయిపోయాయి. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా.. అది కాస్త వైరల్ గా మారింది. `జీవితంలో మార్చులేనివి ఉంటాయి. అలాంటి వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే.. అవి మనకు మధుర క్షణాలు. దీని మీరు ఒప్పుకుంటారా..?` అంటూ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకున్నాడు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శ్రీజను కళ్యాణ్ దేవ్ మర్చిపోలేకపోతున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram