భర్తతో వేగలేక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్.. అమ్మడి పరిస్థితి ఘోరం..?

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ చందమామ సినిమాతో అందరి మనసులు దోచేసింది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆర్య 2 మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారింది. ఆ తర్వాత డార్లింగ్, నేనే రాజు నేనే మంత్రి, సీత, బాద్షా, నాయక్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఇక పెళ్లయి తళ్లయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు భగవంత్ కేసరి, సత్యభామ అనే రెండు తెలుగు సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా తమిళంలో ఇండియన్ 2, హిందీలో ఉమ సినిమాలు చేస్తోంది.

నిజానికి కాజల్ పెళ్లయిన తర్వాత హాయిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని చాలా తపన పడింది. అప్పటిదాకా ఒప్పుకున్న సినిమాలు మాత్రమే ఫినిష్ చేయాలనుకుంది. కానీ పెళ్లయిన తర్వాత ఆమె పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. పైన చెప్పిన విధంగా ఇప్పుడు ఆమె నాలుగు సినిమాల్లో నటిస్తోంది. బిడ్డను కన్న తర్వాత శరీరాకృతి కాస్త మారడంతో జిమ్‌లో కసరత్తులు చేస్తూ కష్టపడుతోంది. గౌతమ్ కిచ్లూతో కెరీర్ లైఫ్ వదిలేసుకుంటానని కాజల్ పెళ్లికి ముందే చెప్పిందట.

అయితే పెళ్లయిన తర్వాత మాత్రం గౌతమ్ అంత మంచి కెరీర్ లైఫ్ ఎందుకు వదిలేసుకోవాలంటూ కాజల్‌తో ఎప్పుడు అంటుండే వాడట. ఫ్యామిలీ కూడా సినిమాలని వదిలేసుకోవడం మంచి నిర్ణయం కాదంటూ ఆమెతో చెప్పే వారట. అందరూ అలా అనడంతో చివరికి ఆమె సినిమాలలో కొనసాగాలని నిర్ణయించుకుందట. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా కాజల్ ఒప్పుకుంటుందని తెలుస్తోంది. రీసెంట్‌గా రీఎంట్రీకి తన భర్త సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందని కాజల్ చెప్పుకొచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఆమె బలవంతంగానే సినిమాల్లో మళ్ళీ రీయంట్రి ఇచ్చిందని సాగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది.