హిందూపురంపై జగన్ స్కెచ్..బాలయ్యని ఓడిస్తారా?

తెలుగుదేశం పార్టీ కంచుకోట…బాలయ్య అడ్డా అయిన హిందూపురంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ సారి అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే చాలావరకు టి‌డి‌పి కోటలని కూల్చిన జగన్..ఈ సారి మిగిలిన కోటలని కూల్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఎలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు.

అక్కడ అధికార బలంతో ప్రజలని తిప్పుకుంటూ బాబుని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసిన కుప్పంలో బాబుని ఓడించడం అనేది కాస్త కష్టమైన విషయమే. సరే ఆ విషయం పక్కన పెడితే..ఇప్పుడు బాలయ్యపై జగన్ ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లో బాలయ్య సత్తా చాటుతున్నారు. రెండు సార్లు వైసీపీ అభ్యర్ధులని మార్చింది. అయినా ప్రయోజనం లేదు. హిందూపురం ప్రజలు బాలయ్యకే పట్టం కట్టారు. ఒకసారి బీసీ, రెండోసారి ముస్లిం అభ్యర్ధిని వైసీపీ నిలబెట్టింది.

హిందూపురంలో ఎలాగో బీసీ, ముస్లిం ఓట్లే ఎక్కువ. కానీ రెండు సార్లు వారు బాలయ్య వైపే నిలబడ్డారు. ఈ సారి జగన్ వ్యూహాత్మకంగా బాలయ్యపై బీసీ మహిళని తెరపైకి తెచ్చారు. హిందూపురంలో ఇక్బాల్‌ని సైడ్ చేసి దీపికని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో అక్కడ పోరు రసవత్తరంగా మారింది. ఇలా బీసీ మహిళ ఫార్ములాతో బాలయ్యకు చెక్ పెట్టాలని జగన్ ప్లాన్ చేశారు.

అయితే హిందూపురం ప్రజలు బాలయ్య వైపే ఉంటారు. ఎందుకంటే అధికారంలో లేకపోయినా సొంత నిధులతో బాలయ్య పనిచేస్తారు కాబట్టి..అక్కడ బాలయ్యకు ఎదురులేదు. కాకపోతే బీసీ మహిళ ఫార్ములా ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి.