30 దాటినా ఇంకా సంసారం మొదలు పెట్టని హీరోయిన్లు.. ఎంతమంది ఉన్నారంటే!

టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తమ ఫేవరెట్ హీరో,హీరోయిన్ల కి సంబంధించిన గుడ్ న్యూస్ లు తెలిస్తే మాత్రం అభిమానులు వారికె ఏదో మంచి జరిగినట్లు సెలెబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పెళ్లి చేసుకొని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైంది అమ్మడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం పూజ వయసు 31 ఏళ్లు. అయినా కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది.

ప్రముఖ హీరోయిన్ తాప్సి పన్ను గురించి మనకు తెలిసిందే. 2010లో విడుదలైన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 34 ఏళ్లు. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు 2005లో విడుదలైన ‘సూపర్ ‘ సినిమాలు తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ఎంతోమంది అభిమానులు మనసు గెలుచుకుంది. ప్రస్తుతం అనుష్క వయస్సు 41 ఏళ్లు. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది.

ప్రముఖ హీరోయిన్ తమన్నా 2005 లో విడుదల అయిన శ్రీ అనే సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఎన్నో సినిమా లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. 34 ఏళ్ళు వచ్చినా కూడా ఈ మిల్క్ బ్యూటీ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఇక నిత్యమినన్ కి 34 ఏళ్లు, ఈషా రెబ్బ కి 33 ఏళ్ళు, ఛార్మి కౌర్ కి 36 ఏళ్లు, టబు కి 50 ఏళ్ళు వచ్చిన కూడా ఈ ముద్దుగుమ్మలు పెళ్లి వైపు అడుగులు వెయ్యడానికి ఆలోచిస్తున్నారు.