తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది హీరోయిన్ జయసుధ.. రాజకీయాలలో కూడా తన మార్క్ చూపిస్తోంది.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయ సుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా అసలు కనిపించడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలలోని ప్రజలలో మమేకమై ఎందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు..
అంతేకాకుండా పార్టీలోనే మార్పులు చేర్పులు కూడా చాలా చేరవేగంగా జరుగుతున్నాయి.. ఈ తరుణంలోనే ప్రముఖ సినీ నటి ఎమ్మెల్యే జయసుధ పార్టీ మార్పు పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల క్రితం ఈమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోని ఆమె బిజెపిలోకి చేరబోతున్నట్లు వార్తలుగా మారుతున్నాయి. కిషన్ రెడ్డి కూడా ఈ అంశం పైన చర్చించినట్లు సమాచారం. తిని ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది..
ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచింది.. అలాంటి జయసుధ ప్రస్తుతం పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏమి ఒక నిర్మాతతో కలిసి బిజెపి నేతలను కలిసినట్లు సమాచారం.. జయసుధ ఇప్పుడే కాకుండా గతంలో కూడా బిజెపి నాయకులను కలవడం జరిగింది ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి జయసుధ ఏ పార్టీలో చేరుతుందో చూడాలి మరి.