రష్మికను విజయ్ వాడుకుని వదిలేసాడా.. మూవీ ప్రీమియర్ షోలో ఇరువురు దూరదూరంగా..!!

టాలీవుడ్ క్యూట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో మనసులు దోచేశారు. వీరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. మళ్లీ వీరిద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సినిమా చేస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే వీరు సినిమాల్లోనే కాదు బయట కూడా రొమాన్స్ చేస్తూ ఉంటారని గత కొంతకాలంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కలిసి మాల్దీవులుకు వెళ్లడం, విజయ్ ఇంటికి రష్మిక రావడం, బర్త్‌ డే వంటి ఫంక్షన్లకు కలిసి హాజరు కావడం వంటివి అభిమానులు అందరూ గమనిస్తున్నారు. వీటన్నింటినీ హైలైట్ చేస్తూ వారి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

అయితే ఇటీవల ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన “బేబీ” ప్రీమియర్ షోకి విజయ్‌, రష్మిక వచ్చారు కానీ వారు కలిసి కనిపించలేదు. వారిద్దరూ దూరదూరంగా ఉంటూ అభిమానులకు షాకిచ్చారు. గురువారం రాత్రి ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో “బేబీ” ప్రీమియర్ షో వేశారు. ఈ షోకి విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫేమ్ రాశీ ఖన్నాతో కలిసి వచ్చాడు.

ఈ షో మొదలు పూర్తయ్యే వరకు ఆమెతోనే కలిసి ఉన్నాడు. రష్మిక విజయ్ దగ్గరికి అసలు పోలేదు. వీరిద్దరూ కలిసి కెమెరా కంటికి కనిపించలేదు. దాంతో వీరిద్దరికి ఏమైంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా కలిసే ఉంటారు కదా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరికొందరు వీరిద్దరూ విడిపోయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ రష్మిక తమ ఫ్యామిలీ మెంబర్ గా కలిసి పోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరులో ఉన్నప్పుడు తమ ఫ్యామిలీతో కలిపి చాలా రోజులు గడిపిందని కూడా వెల్లడించాడు. తన అన్నయ్య విజయ్, రష్మిక మధ్య ఏం లేదని, వారిద్దరు మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు.

అయినా అభిమానులు రష్మికను బయట కనిపించిన ప్రతిసారి వదిన వదిన అంటూ రచ్చ చేస్తున్నారు. ఇలా అరిచేటప్పుడు రష్మిక నవ్వుతుందే తప్ప కోపంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం లేదు. అయితే గురువారం రాత్రి వారు వేరువేరుగా ఉండటం పలు బ్రేకప్ ఊహాగానాలకు దారితీస్తోంది.