మహేష్, రాజమౌళి సినిమాపై కీలక అప్‌డేట్.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్నారట!

మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు వీరిద్దరూ ఒక అడ్వెంచర్ మూవీ కోసం చేతులు కలిపారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నుంచి స్పూర్తి పొందుతుందని రాజమౌళి ఇప్పటికే హైప్స్ పెంచేశారు. అయితే ఈ చిత్రాన్ని మరింత మోడర్న్‌గా సెట్ చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పారు. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌తో సహా పలు దేశాల్లో ఈ చిత్రం చిత్రీకరించనున్నట్లు సమాచారం.

మహేష్‌ బాబు అడవికి మాస్టర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అతనిపై కొన్ని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను ఉండనున్నాయి. రూ.1,500 కోట్లతో వస్తున్న ఈ సినిమాలో క్రిస్ హేమ్స్‌వర్త్‌తో సహా కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రాజమౌళి, అతని టీమ్ స్క్రిప్ట్, ప్రీ విజువలైజేషన్ కోసం పని చేస్తున్నారు. ఈ హైలీ యాంటిస్పేటడ్ మూవీ 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ కూడా నటించనున్నారట. వారెవరు అనేది ప్రస్తుతం హిందీ సినిమా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిగా మారింది. రాజమౌళి తీసుకున్న ప్రతి నటుడిని చాలా బాగా వాడతారు. మరి ఈ బాలీవుడ్ స్టార్స్ ఏ పాత్రలు పోషించనున్నారు? సినిమా అని ఎంత గొప్పగా మలచనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు అని గమనించాలి.