పైన ఫోటోలో పరికిని ధరించి ఒంటి నిండా నగలు వేసుకుని అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? మీకు బాగా తెలిసిన హీరోనే. టాలీవుడ్ లో సదరు హీరోకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవలె ఓ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. గెస్ చేశారా..? ఇంకా గుర్తుకురాలేదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండి బాబు.
తేజ్ తల్లికి కూతుర్లు లేరు. అందువల్ల తేజ్ ను అమ్మాయిలా రెడీ చేసి ఫోటో షూట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తేజ్.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కెరీర్ మంచి ఊపులో ఉన్న తరుణంలో బైక్ యాక్సిడెంట్ వల్ల పది రోజులు కోమాలో ఉన్న తేజ్.. `విరూపాక్ష` మూవీతో మళ్లీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం బ్రో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో రియల్ లైఫ్ మామఅల్లుళ్లు అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. జూలై 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.