అడవి శేషును దారుణంగా మోసం చేసిన అక్కినేని సుప్రియ…?

ప్రముఖ నటుడు, దర్శకుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కర్మ’ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే అంతకుముందే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా నటించాడు. కానీ హీరోగా నటించిన మొదటి సినిమా ‘ కర్మ ‘ హిట్ అవ్వలేదు. ఆ తర్వాత నటించిన క్షణం, గూడాచారి సినిమాలతో అడవి శేషు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హిట్ 2, మేజర్ లాంటి సినిమాలో నటించి యంగ్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు .

అడవి శేషు గూడచారి సినిమాలో నటిస్తున్న సమయంలో యార్లగడ్డ సుప్రియ తో పరిచయం ఏర్పడింది. ఆ సినిమా టైంలో అడివి శేషు కి ఫైనాన్షియల్ గా సుప్రియ సపోర్ట్ చేసింది. దాంతో వారిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లడంతో వారిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారని అంత గుసగుసలు మొదలు పెట్టారు. అలానే అక్కినేని కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ కి అడివి శేషు వెళ్లడంతో అందరూ వారి ప్రేమ నిజమే అని అంత గట్టిగ నమ్మారు . దాంతో అడివి శేషు, సుప్రియ ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోభోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలానే జూన్ 16 న వారి పెళ్లి అని ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. కానీ వారి పెళ్లి మాత్రం జరగలేదు.

వారిద్దరి పెళ్లి ఎందుకు ఆగిపోయింది అని చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి వారి పెళ్లి జరగకపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి అడివి శేషు,సుప్రియ పెళ్ళికి అక్కినేని కుటుంబం నో చెప్పేదంట. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని కారణంగా సుప్రియ కూడా అడివి శేష్ కి దూరంగా ఉంటుంది అని తెలుస్తుంది. అందుకే జూన్ 16న జరగాల్సిన వారి పెళ్లి ఆగిపోయిందని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు నో చెప్పడంతో అడవి శేషుని దారుణంగా మోసం చేస్తావా అంటూ చాలా మంది ఆమెపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.