సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా ఏళ్లు అయిపోతున్నాయి. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఓ మూవీ చేసింది. అదే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో యంగ్ స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా చేశాడు.
జయసుధ, మురళి శర్మ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందించారు. ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. విడుదలకు పది రోజుల సమయం మాత్రమే ఉన్నా.. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అవ్వలేదు. అసలు ఆగస్టు మొదటి వారంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల కాబోతుందన్న విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. ఎలాంటి హైప్ ఈ మూవీపై క్రియేట్ అవ్వలేదు.
అయితే లెటెస్ట్ సమాచారం ప్రకారం.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. అందుకు కారణం.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ నటించిన `బ్రో` మూవీనే. జూలై 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత అనుష్క మూవీ రానుంది. కానీ, బ్రో మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. పవన్ కళ్యాణ్ మ్యానియా ముందు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోతుంది. అందుకే అనుష్క మరియు చిత్ర టీమ్ భయపడ్డారట. ఆగస్టు 4న కాకుండా ఆగస్టు 18న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.