మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే..ఈసారి ట్రిపుల్ ధమాకా!

హీరోల బర్త్ డే వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఏదైనా కొత్త అప్డేట్ ఉంటుందేమో, కొత్త పోస్టర్స్ వస్తాయేమో అని ముందే నుంచే ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తాజాగా మరో ట్రెండ్ కూడా నడుస్తుంది. అదే రీ రిలీజ్. హీరోల ఓల్డ్ మూవీస్ ని థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నీ రీ రిలీజ్ చేసారు. పోకిరి, ఒక్కడు, బిల్లా, ఖుషి, తొలిప్రేమ, సింహాద్రి, ఆరెంజ్, దేశముదురు, చెన్నకేశవ రెడ్డి, జల్సా సినిమాలు రిలీజ్ అయ్యి కొత్త రికార్డులు సృష్టించాయి. అయితే ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే రాబోతుంది. దీంతో ఈసారి బిజినెస్ మెన్ సినిమా తో రిలీజ్ చేయాలని పాలన్ చేస్తున్నారు. అంతే కాదు ఈసారి సూపర్ స్టార్ బర్త్ డే కి ఒకటి కాదు మూడు అప్డేట్ లు రెడీ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కి ఇక ట్రిపుల్ ధమాకా అంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆగష్టు లో మహేష్ బాబు బర్త్ డే ఉందనే విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది బర్త్ డే స్పెషల్ గా పోకిరి సినిమాని రిలీజ్ చేసారు. ఆ తరువాత ఒక్కడు సినిమా రిలేస్ చేసారు. ఈ సినిమాల్లో మహేష్ బాబు స్టైల్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు కెరీర్ పోకిరి ముందు, తరువాత అని అంటుంటారు. అయితే ఈసారి బర్త్ డే కి మహేష్ బాబు కెరీర్ లో మరో హిట్ సినిమా బిజినెస్ మెన్ ను రిలీజ్ చేయడానికి టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 4కే వర్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అని టాక్ నడుస్తుంది.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు బర్త్ డే కి ఈ మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు అప్డేట్ లతో పాటు మరొక అదిరిపోయే అప్డేట్ కూడా రానుంది. మహేష్ బాబు తరువాత రాజమౌళితో సినిమా చేయనున్నారు అని తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటివరకు లాంచ్ కాలేదు. కానీ మహేష్ బాబు బర్త్ డే రోజు ఈ సినిమాపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈసారి మహేష్ బాబు బర్త్ డే కి ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా ఖాయం అంటున్నారు.