పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా ఆయనను ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే.. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అయిన ఈయన తాజాగా జూలై 4వ తేదీన ఎలుగెత్తు ఎదిరించు ఎన్నుకో – జైహింద్ అనే ఒక బయోతో తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేయడం జరిగింది.
అలా ఒక ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేశారో లేదో ఇలా ఫాలోవర్లు పోటేత్తారు. దెబ్బకు ఇన్ స్టా మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది.. ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం వరకు ఆయన ఫాలోవర్స్ లిస్టు చూస్తే ఏకంగా 2.3 మిలియన్లకు చేరడం గమనార్హం అందులోను ఒక పోస్ట్ కూడా పెట్టకుండానే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ వచ్చారు అంటే ఇక ఆయన పోస్ట్ పెడితే మరెంత మంది ఫాలోవర్స్ వస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇన్స్టా లో మొదటిగా ఏం పోస్ట్ చేయబోతున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు ఫాలోవర్స్ పెరిగే సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆయనను ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇన్స్టా లో ఫాలో అవుతూ ఉండడం గమనార్హం.
తాజాగా శృతిహాసన్, కీర్తి సురేష్ తదితరులు పవన్ కళ్యాణ్ ను ఇంస్టాగ్రామ్ లో అనుసరిస్తున్నారు. మొత్తానికి అయితే వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానులు అన్న విషయం తెలుస్తోంది. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్లను కూడా తన వైపు తిప్పుకునే నైజం ఆయనది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.