ఏడాదిలో హైయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన తెలుగు సినిమాలేవో తెలుసా..

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ఏడాది ప్రారంభం నుండి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడాదిలో ఆరు నెలలు పూర్తి అయింది. అయితే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా చిన్న సినిమాలు మాత్రం బాక్సఫీస్ వద్ద బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈరోజు వరకూ టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా ఓపెనింగ్స్ డే సాధించిన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాల్లో ‘ ఆదిపురుష్ ‘ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్ల రూపాయలు వసూలు చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘ వీర సింహ రెడ్డి’ సినిమా రూ. 50 కోట్లు కలెక్ట్ చెయ్యగా, చిరంజీవి నటించిన ‘ వాళ్తేరు వీరయ్య ‘ సినిమా రూ. 49.5 కోట్లు వసూలు చేసింది. ఆ తరువాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా రూ. 38 కోట్లు వసూలు చెయ్యగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ బ్రో ‘ సినిమా రూ. 49 కోట్లు వసూలు చేసింది.

అయితే ఇంకా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు కొన్ని ఇంతవరకు విడుదలవ్వలేదు. అవి ఈ ఏడాది చివరికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కంటెంట్ పరంగా కథ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమా ని సక్సెస్ఫుల్ గా హిట్ చేస్తున్నారు. అయితే ఈ ఆరు నెలల్లో చాలా సినిమాలు విడుదల అయినప్పటికీ కేవలం 5 సినిమాలు మాత్రమే అత్యధిక గ్రాస్ ని సాధించిన  సినిమాలుగా విశ్లేషకులు చెప్పడం జరిగింది. ఇక రాబోయే ఆరు నెలల్లో వచ్చే సినిమాలు ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి.