ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబోలో వచ్చిన ఐకైక సినిమా `బద్రినాథ్`. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో తమన్నా మేనత్త గుర్తుందా.. మర్చిపోయే క్యారెక్టర్ కాదు ఆమెది. విలన్ భార్య పాత్రలో చాలా పవర్ ఫుల్ గా నటించిన ఆ నటి పేరు అశ్విని కల్సేకర్.
మరాఠీ మరియు హిందీ సినిమాల్లో అశ్విని ఎక్కువగా నటించింది. బుల్లితెరపై కూడా అనేక సీరియల్స్, షోలు చేసింది. బద్రినాథ్ మూవీతో తెలుగు తెరకు లేడీ విలన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఆమె నిప్పు, మెహబూబా చిత్రాల్లో మెరిసింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అశ్విని భర్త టాలీవుడ్ లో టాప్ విలన్. అతనెవరో కాదు మురళీ శర్మ.
అశ్విని 1998లో నితేష్ పాండేని వివాహం చేసుకుంది. వారు 2002లో వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకున్నారు. 2009లో నటుడు మురళీ శర్మను అశ్విని రెండో వివాహం చేసుకుంది. మురళీ శర్మ బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లకు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో విలన్ గానే కాకుండా అనేక సహాయక పాత్రలను పోషిస్తూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్లలో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా అనేక భాషల్లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.