నందమూరి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా..?

నందమూరి హీరో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . అసలు నందమూరి వారసుడు వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బాలయ్య ఒక తీపి కబురు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరిజోడి అయినటువంటి చిరంజీవి నాగార్జున వారసులను సైతం ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ బ్యాచ్ లో ఉన్న హీరోగా బాలయ్య కుమారుడిని ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.

Nandamuri Balakrishna opens up about Mokshagna debut

బాలయ్య కుమారుడి సినిమా కోసం బాలయ్య అభిమానుల సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు తన సినిమాలు చేస్తూనే తనయుడు సినిమా కోసం కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది బాలయ్య. 2020 నుంచి మోక్షాజ్ఞ ఎంట్రీ పైన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో మోక్షజ్ఞ నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత పూరి ,అనిల్ రావుపూడి, బుచ్చిబాబు వంటి దర్శకుల పేర్లు వినిపించగా బాలయ్య చివరికి దాని స్వయంగా ఆదిత్య 369 సిక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిపారు.

తాజాగా మళ్లీ అదే విషయాన్ని బాలయ్య అమెరికాలో జరిగిన తానా సభలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లి అక్కడ అభిమానులతో నటించడం జరిగింది. అక్కడ బాలయ్య ఏం మాట్లాడారంటే తన నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 పై ఫోకస్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాతోనే తన కుమారుడిని లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది బాలయ్య. 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమా అప్పట్లో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది.