పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో ది అవుతార్.. ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం మాత్రం బిజీగా ఉంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పలు ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ట్రైలర్ లేకుండా టికెట్ కదలని ఓవర్సీస్ లాంటి ప్రాంతాలలో కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే జరుగుతున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఈ సినిమా రీమిక్స్ సినిమాగా పిలవడం తోపాటు పాటలు కూడా చెత్తగా ఉండడంతో బుకింగ్స్ పెద్దగా జరుగుతున్నట్లు కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ట్రైలర్ విడుదల అయితే ఈ సినిమా ట్రైలర్తో మంచి బుకింగ్స్ ఏర్పడతాయని అభిమానులు భావిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా బ్రో సినిమాకి రాబోయే రోజుల్లో చాలా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. ఈ సినిమా విడుదల సమయానికి మూడు హాలీవుడ్ సినిమాలు విడుదలబోతున్నాయి..B,C సెంటర్లో ఈ ప్రభావం ఉండదు కానీ హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతాలలో మాత్రం కచ్చితంగా ఈ సినిమాల ప్రభావం ఉంటుంది.
ముఖ్యంగా మల్టీప్లెక్స్ షోలో బ్రో చిత్రానికి బాగా తగ్గేటట్టుగా కనిపిస్తోంది మరొకపక్క రీసెంట్గా విడుదలైన బేబీ సినిమా కూడా కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం వసూలు మరో రెండు వారాలు కూడా గట్టిగా ఉండేటట్లు కనిపిస్తున్నాయి విడుదలైన అన్ని ప్రాంతాలలో కూడా బేబీ చిత్ర ప్రభావం బ్రో సినిమా పైన పడే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇక బ్రో సినిమా యూఎస్ లో అయితే అక్కడ ఓపెన్ హెయిర్, మిషన్ ఇంపాజిబుల్, బార్బీ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో బ్రో సినిమాకి అక్కడ థియేటర్ షో దక్కడం చాలా కష్టమే.