`బేబీ` మూవీకి ఆ ముగ్గురి రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా..?

బేబీ.. రీసెంట్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ డ్రామ ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మించారు. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

ఈ ముగ్గురు చుట్టూనే బేబీ మూవీ క‌థ న‌డుస్తుంది. జూలై 14న విడుద‌లైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ల‌భించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంలో బేబీ బాక్సాఫీస్ వ‌ద్ద బీభ‌త్సం సృష్టిస్తోంది. వ‌న్ వీక్ లోనే ఈ చిత్రం రూ. 15 కోట్ల‌కు పైగా లాభాల‌ను సొంతం చేసుకుంది. అయితే డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన బేబీ మూవీకి ఆనంద్‌, వైష్ణ‌వి, విరాజ్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ చాలా త‌క్కువ అట‌.

 

సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించిన ఈ ముగ్గురి రెమ్యున‌రేష‌న్ కోటిన్న‌ర కంటా త‌క్కువే అని చెప్పాలి. మెయిన్ హీరో కాబ‌ట్టి ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు రూ. 80 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. అలాగే వైష్ణ‌వి చైత‌న్యకు రూ. 30 ల‌క్ష‌లు, విరాజ్ అశ్విన్ కు రూ. 20 ల‌క్ష‌లు ఇచ్చార‌ని అంటున్నారు. ఇక డైరెక్ట‌ర్ సాయి రాజేష్ రూ. కోటి వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకున్నాడ‌ని స‌మాచారం. అన్న‌ట్లు బేబీ మూవీ టోట‌ల్ బ‌డ్జెట్ రూ. 10 కోట్లు కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది.