టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయ్ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం కాకముందే కొడుకు అఖిరా నందన్ జన్మించారు.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.. అఖిరా నందన్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా హైట్ అందంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా హైలైట్ గా మారుతూ ఉంటారు.
మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ఫంక్షన్లో కూడా అఖిరా నందన్ పాల్గొనడం లేదు. పవన్ కళ్యాణ్ వారసుడు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కి మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ను తన కుమారుడు దూరం పెట్టడానికి కారణం అదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా తన తల్లి రేణు దేశాయ్ మాటలు విని తనకు దూరంగా ఉంటున్నట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలలో కంటే జనసేన పార్టీ ద్వారా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ పార్టీ పెట్టడానికి గతంలో తన కొడుకు కూతురు పైన ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బులు సైతం వాడుకొని పార్టీకి ఆ డబ్బులు పెట్టానని ప్రచారం చేయడం జరిగింది. ఈ విషయంలో రేణు దేశాయ్, పవన్ మధ్య గొడవలు జరిగాయని.. తమ పిల్లల మీద వేసిన డబ్బు మొత్తం ఖర్చు పెడితే తమ పిల్లల భవిష్యత్తు ఏంటి కావాలి అని రేణు దేశాయ్ గొడవపడడంతో వీరిద్దరూ విడిపోయినట్టు సమాచారం. ఈ విషయం అఖిరా నందన్ కు తెలియడంతో తన తల్లి మాటలు పవన్ కళ్యాణ్ కుమారుడు పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.