సరికొత్త లుక్స్‌లో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్య రాజేష్..

టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ మనందరికీ సుపరిచితురాలే. ఐశ్వర్య రాజేష్ అవ్వటానికి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో ఉమెన్ క్రికెటర్ పాత్రలో ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ‘, నాని నటించిన ‘టక్ జగదీష్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

అయితే ఐశ్వర్య కాస్త రిలాక్స్ అవ్వటానికి హవాయికి వెళ్ళింది. అక్కడ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ తన గ్లామరస్ అందాలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. ఐశ్వర్య హవాయిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘ఎంతో విలువైన వజ్రం హవాయి’ అంటూ రాసుకొచ్చింది. ఐశ్వర్య ఫోటోలు చూసిన అభిమానులు ‘ఎంతో అందంగా ఉన్నావ్ ఐశ్వర్య’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందానికి ప్రకృతి అందాలు తోడై ఐశ్వర్య ను మరింత గ్లామరస్ గా చూపిస్తున్నాయి. బ్లాక్ కలర్ ప్యాంటు, భుజాలపై నుండి జరిపోతున్న టాప్ లో ఐశ్వర్య అందాలు కుర్రాళ గుండెల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

ఇటీవలే ‘పర్హనా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు
వచ్చింది. 2023 లో ఐశ్వర్య రాజేష్ చేతిలో వరుస సినిమా లు ఉన్నాయి. ఏడాదిలో ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ నటించిన ఐదు సినిమాల వరకు రిలీజ్ కావటం విశేషం. అవికాక ఈ ఏడాది ఇంకా ఏడు సినిమాలో ఐశ్వర్య నటిస్తుంది. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఐశ్వర్య కాస్త గ్యాప్ తీసుకొని హవాయిలో హాలీడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది.