స్టార్ హీరోలు,డైరెక్టర్లపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్..!!

కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యామిలీ తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అయితే తమ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడడంతో తెలుగులో కంటే ఐశ్వర్య రాజేష్ తమిళంలోని ఎక్కువగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. తెలుగులో అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది.

Aishwarya Rajesh To Play Lead In Tamil-Hindi Bilingual 'Manik'

ఐశ్వర్య రాజేష్ నటించిన సినిమాలలో ప్రతి సినిమాకు తన పాత్రకు ఒక ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి స్టార్ డైరెక్టర్లు సెలబ్రిటీల గురించి అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ గ్లామరస్ ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారని దీనివల్ల ఎక్కువగా అవకాశాలు లభించడం లేదని ఆమె అభిప్రాయంగా తెలియజేస్తోంది.. ఇక తన విషయానికి వస్తే ఎంతోమంది స్టార్స్ ఇతర ప్రముఖులు తన యాక్టింగ్ స్కిల్స్ స్టేజ్ పైన మెచ్చుకోవడం జరిగిందని కానీ వాళ్లు నిర్మిస్తున్న ప్రాజెక్టులలో మాత్రం తనని తీసుకోరంటూ తెలియజేస్తోంది.

 

తనని స్టార్ హీరోల చిత్రాలలో భారీ బడ్జెట్ చిత్రాలలో ఎందుకు తీసుకోరో అనే విషయాన్ని వివరిస్తూ నేను చిన్న బడ్జెట్ ఫిలిం.. సేట్రిక్ మూవీస్ తో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాను నన్ను అభిమానించే అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతోంది..ఇప్పటికే 15 ఒకేలాంటి సినిమాలు చేశానని తెలియజేసింది. ఈ ఏడాది ఐశ్వర్య నటించిన ఐదు తమిళ సినిమాలు విడుదలయ్యాయట. రీసెంట్ గా తన నటించిన ఫర్జానా చిత్రం విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ ఆమ్మడి చేతిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయట.