మొన్నటివరకు మైండ్ గేమ్ ఆడటంలో అధికార వైసీపీ ముందు ఉండేది. టిడిపిని దెబ్బతీస్తూనే ఉండేది. ఇలా ఎక్కడకక్కడ టిడిపికి చెక్ పెడుతూ వచ్చేది. కానీ ఇటీవల సీన్ రివర్స్ అయింది. టిడిపినే మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి టిడిపి..వైసీపీకి షాకులు ఇస్తూనే ఉంది. ఇలా ఎప్పటికప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ముందుకెళుతుంది.
ఇదే క్రమంలో వైసీపీకి పట్టున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి పై చేయి సాధించే దిశగా మైండ్ గేమ్ ఆడుతుంది. ఇప్పటికే అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలని టిడిపిలోకి తీసుకుంది. అదే సమయంలో ఇంకా పలువురు నేతలు కూడా టిడిపిలోకి వస్తారని అంటున్నారు. అలాగే పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్..వైసీపీ నేతల అక్రమాలు అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో వైసీపీ నేతలు వివరణ ఇచ్చుకునే పరిస్తితి. ఈ మధ్య అనిల్ కుమార్ యాదవ్ని ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు.
అనిల్ అక్రమాలు చేశారని లోకేష్ ఆరోపించడం..అసలు తాను చేయలేదని, దేవుని మీద ప్రమాణం చేయడం అనిల్ వంతు అయింది. ఇలా మైండ్ గేమ్ తో ఆడుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని టిడిపి టార్గెట్ చేసింది.ఇప్పటికే పలుమార్లు ఆదాల పార్టీ మారిపోయారు. ఇప్పుడు కూడా మారనున్నారని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు.
గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటు ఇచ్చిన తర్వాత టిడిపిని వదిలి ఆదాల వైసీపీలోకి వెళ్ళి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు వైసీపీని వదిలి అలాగే టిడిపిలోకి వస్తారని అంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ బాధ్యతలే ఆదాల చూస్తున్నారు. దీంతో ఆయన వైసీపీకి షాక్ ఇస్తారని అంటున్నారు. మరి ఇది మైండ్ గేమ్..లేక నిజంగానే ఆదాల పార్టీ మారతారేమో చూడాలి.